Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
భూతాలు, ప్రేతాలు, పిశాచాల కథలను ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు...
కానీ నేను చెప్పబోయే ఈ కథ మాత్రం కల్పితం కాదు...
ఇది మన చరిత్ర.
మన ఉనికికి సంబంధించిన చరిత్ర.
ఒకప్పుడు ఈ భూమిపై జరిగిన విషయాలను, మన పూర్వీకుల అసలు గాథలను, మానవజాతి పుట్టుక వెనుక దాగి ఉన్న సత్యాలను కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రపంచం నుండి దాచిపెట్టారు.
చరిత్ర మరచిపోలేదు...
దానిని మరిపించారు.
కానీ సత్యం ఎంత లోతైన చీకటిలో దాగి ఉన్నా, ఒక రోజు వెలుగులోకి రావాల్సిందే.
ప్రతి కార్యానికి ఒక కార్యసాధకుడు ఉంటాడు.
ఈ మహా కార్యానికి కూడా ఒకడు ఉన్నాడు.
అతని గురించి మనం తర్వాత తెలుసుకుందాం.
అయితే, ఆ కథ ప్రారంభం కావడానికి ముందు ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకోవాలి...
ఒక వ్యక్తి గురించి కాదు...
ఒక జాతి గురించి.
---
అమావాస్య.
ఆకాశంలో చంద్రుడి జాడ లేదు.
నల్లటి మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్నాయి.
గాలి కూడా భయంతో నిశ్శబ్దంగా నిలిచిపోయినట్లుంది.
శ్రీలంక దక్షిణ భాగంలో, మానవులు అడుగుపెట్టడానికి కూడా భయపడే ఒక అతి పురాతన అరణ్యం ఉంది.
ఆ అడవిని స్థానికులు "మృత్యు వనం" అని పిలుస్తారు.
ఎందుకంటే అక్కడి నుండి లోపలికి వెళ్లిన చాలామంది తిరిగి బయటకు రాలేదు.
ఆ రాత్రి ఆ అడవి మధ్యలో ఉన్న ఒక విశాలమైన ఖాళీ ప్రదేశంలో వందలాది అగ్నికుండాలు వెలుగుతున్నాయి.
ఆ అగ్నిజ్యోతుల మధ్యలో ఒక విచిత్రమైన జాతికి చెందిన మనుషులు నిలబడి ఉన్నారు.
వారిని మనుషులు అనడం కూడా పూర్తిగా సరైంది కాదు.
ఎందుకంటే వారు మానవుల్లా కనిపించినప్పటికీ, వారి రూపం భయంకరంగా ఉంది.
వారి ఎత్తు సాధారణ మనుషుల కంటే చాలా ఎక్కువ.
ఎనిమిది అడుగుల వరకు పెరిగిన శరీరాలు.
పర్వతాల్లా కనిపించే కండరాలు.
విస్తారమైన భుజాలు.
ముఖం నుండి బయటకు పొడుచుకొచ్చిన పెద్ద దంతాలు.
సింహంలా దట్టమైన జుట్టు.
ఎర్రటి కళ్ళు.
వారిలో ప్రతి ఒక్కరు యుద్ధానికి సిద్ధంగా ఉన్న యోధుల్లా కనిపిస్తున్నారు.
ఆ వందలాది మంది ఒక పెద్ద సమాధి చుట్టూ వలయాకారంగా నిలబడి ఉన్నారు.
వారి కాళ్ళు భూమిని బలంగా తాకుతున్నాయి.
వారి శరీరాలు ఒక విచిత్రమైన లయలో కదులుతున్నాయి.
వారు చేస్తున్న నృత్యం సాధారణ నృత్యం కాదు.
అది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక గూఢమైన ఆచారం.
వారి నోటినుండి వినిపిస్తున్న మంత్రాలు ఆ అడవంతా మారుమ్రోగుతున్నాయి.
వారి భాష ఈ కాలానికి చెందినది కాదు.
ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఎవరూ మాట్లాడని ఒక ప్రాచీన భాష.
ఒక్కసారిగా ఆ గుంపులో నిశ్శబ్దం నెలకొంది.
అందరి చూపులు ఒకే వ్యక్తి వైపు తిరిగాయి.
అతడే వారి నాయకుడు.
అతని ఎత్తు తొమ్మిది అడుగులు.
మిగతా వారికంటే మరింత బలిష్టమైన శరీరం.
భుజాలపై నల్లటి జడలు.
మెడ నిండా ఎముకలతో చేసిన హారాలు.
అతని కళ్ళలో ఒక విచిత్రమైన క్రూరత్వం కనిపిస్తోంది.
అతను తన సహచరుల వైపు తిరిగి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
కొద్దిసేపటికే నలుగురు యోధులు ఒక భారీ ఖడ్గాన్ని తీసుకొచ్చారు.
ఆ ఖడ్గం సాధారణ ఆయుధం కాదు.
దాని మీద తెలియని లిపిలో చెక్కబడిన అక్షరాలు ఎర్రగా మెరుస్తున్నాయి.
నాయకుడు ఆ ఖడ్గాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు.
సమాధి పక్కన మండుతున్న హోమగుండంలో దానిని ఉంచాడు.
కొద్దిసేపటికి ఆ ఖడ్గం ఎర్రగా కాలిపోయింది.
అప్పుడతను ఒక భయంకరమైన నృత్యాన్ని ప్రారంభించాడు.
అతని కాళ్ళ దెబ్బలకు నేల కంపిస్తోంది.
అతని అరుపులు అడవంతా ప్రతిధ్వనిస్తున్నాయి.
చుట్టూ ఉన్న వారందరూ గట్టిగా నినదిస్తున్నారు.
"జయ ఛాయాసురా!"
"జయ ఛాయాసురా!"
"జయ ఛాయాసురా!"
అని అరిచారు.
ఆ అరుపులు ఆకాశాన్ని చీల్చినట్లుగా వినిపించాయి.
అంతలో నాయకుడు ఆకాశం వైపు ఖడ్గాన్ని ఎత్తాడు.
మరో చేతితో తన పొడవైన జుట్టును పట్టుకున్నాడు.
ఒక్క క్షణం...
అందరూ ఊపిరి బిగబట్టారు.
మరుసటి క్షణం...
ఖడ్గం మెరుపులా కిందికి దూసుకొచ్చింది.
ఒకే వేటుతో అతని తల శరీరం నుండి వేరైంది.
రక్తం అగ్నిజ్వాలలపై చిందింది.
అతని తల నేరుగా హోమగుండంలో స్వయం గా అతనే వేసుకున్నాడు .
చుట్టూ ఉన్న వారందరూ ఉన్మాదుల్లా కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు.
కానీ...
ఆ అరుపుల మధ్య ఒక ఏడుపు వినిపించింది.
హృదయాన్ని పిండివేసే ఏడుపు.
అక్కడ ఒక స్త్రీ నేలపై మోకాళ్లపై కూర్చుని విలపిస్తోంది.
ఆమె అతని భార్య.
తన భర్త మరణాన్ని కళ్లారా చూస్తోంది.
కానీ ఆమెకు అడ్డుకునే హక్కు లేదు.
ఎందుకంటే అది వారి జాతి యొక్క అత్యంత పవిత్రమైన ఆచారం.
---
ఆ సమాధి ఎవరిదో తెలుసా?
అది ఒక రాజు సమాధి కాదు.
ఒక యోధుడి సమాధి కాదు.
లక్షల సంవత్సరాల క్రితం జీవించి మరణించిన మహా రాక్షసుడు...
ఛాయాసురుడు యొక్క సమాధి.
వారి నమ్మకం ప్రకారం ఛాయాసురుడు స్వయంగా పరమశివునితో యుద్ధం చేశాడు.
ఆ యుద్ధంలో పరమశివుడు తన త్రిశూలంతో అతని తలను వేరుచేశాడు.
కానీ ఛాయాసురుడు పూర్తిగా మరణించలేదని వారి విశ్వాసం.
అతను ఇంకా నిద్రలో ఉన్నాడని వారు నమ్ముతారు.
ఒక రోజు అతను మేల్కొంటాడని.
అప్పుడు తన వంశాన్ని మళ్లీ ప్రపంచ పాలకులుగా చేస్తాడని.
అందుకే వారి జాతిలో ప్రతి నాయకుడు నలభై సంవత్సరాలు నిండిన తర్వాత తన తలను త్యాగం చేయాలి.
అది ఛాయాసురుడికి సమర్పణ.
అది అతన్ని మేల్కొలిపే ప్రయత్నం.
వేల సంవత్సరాలుగా వారు ఇదే చేస్తున్నారు.
కానీ...
ఈసారి ఏదో భిన్నంగా జరగబోతోంది.
ఎందుకంటే ఆ రాత్రి...
ఆ సమాధి లోపల నుండి ఒక శబ్దం వినిపించింది...
భూమి స్వల్పంగా కంపించింది...
మరియు వేల సంవత్సరాలుగా మూసి ఉన్న ఒక రహస్యం మెల్లగా మేల్కొనడం ప్రారంభించింది...
ఆ అగ్ని నుండి ఒక నల్లటి స్త్రీ రూపం పోగా ల బయటకి వచ్చింది ! ఆమె ఇలా చెప్పింది ! వారికి అర్థం అయ్యే భాష లో , కానీ నేను మీకు తెలుగు లో చెప్తా వినండి !
ఆ నల్లటి చయ రూపం లో ఉన్న ఆ స్త్రీ ఒక రక్త పిశాచి.
ఆ పిశాచి ఆనందం తో గట్టిగా నవ్వుతూ ఇలా అంది
పిశాచి :- " అమ్మ పుణ్య స్త్రీ నీ భర్త కి ఏమి కాలేదు ! మునుపు ఏనాడూ జరగని ఒక ప్రకంపనని ఈ సారి నేను చవిచూశాను !!! దూరంగా భారత ఖండం లో , శైలగిరి అనే పర్వతం కి అతి చేరువలో , 22 సంవత్సరాల కింద పునర్వసు నక్షత్రం లో ఒకడు పుట్టాడు !! ఈ సమస్త విశ్వం లో ఆ పాతాళ రాజ్యం కి చేరుకునే ఒక్క ఒక్క కార్య సాధకుడు ! వాడిని తీసుకు రండి !! " అని అంది , అల ఆ పిశాచి ఆందో లేదో ఒక్క క్షణం లో ఆ హోమ గుండం నుండి ఆ తల బయటకి వచ్చి దాని అంతట అదే ఆ శరీరానికి అతుకుంది !
అతను ఆ పిశాచి కి మొక్కరిల్లి నమస్కరించాడు, వల్ల నాయకుడిని చూసిన మిగతా వారు అంతా అనుసరించారు ,
అప్పుడు ఆ నాయకుడి భార్య ఆ పిశాచి కి నమస్కరించింది !
అప్పుడు ఆ పిశాచి ఇలా పలికింది :- " నేను నీ భర్త మెదడు లోనే ఉంటా ! ఆతనికి మార్గదర్శకం అవుత !" అని అదృశ్యం అయ్యింది , అల ఆ పిశాచి అదృశ్యం అయ్యిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఆనంద తాండవం చేశారు, ఎందుకు అంటే కొన్ని లక్షల ఏళ్ల తారల వాళ్లు సాధించలేనిది వీళ్ళు సాధించారు గనుక ! ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ! మరియు వాళ్ళ పూర్వీకుల ఆర్తనాదాలు ! వాళ్ళకి ఇప్పుడు ఆశీస్సులు అయ్యాయి ! .........
CHAYA ( the rebirth)
Published: June 19, 2026 at 4:05 PM
Your input calibrates the database for others.
Ready to play...